‘స్పెడర్’ తర్వాత రకుల్ కమిటైన తెలుగు సినిమా ఇదే‌!

మహేష్ తో ‘స్పెడర్’  సినిమా చేసిన తర్వాత రకుల్ ప్రీతి సింగ్ ఒక్కసారిగా తెలుగు తెర నుండి మాయమైంది. ఈ సంవత్సరకాలంగా ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఆ సినిమా డిజాస్టర్ ఫలితమో ..లేక కొన్నాళ్లు స్వయంగా తీసుకున్న గ్యాపో కానీ రకుల్ మాత్రం 2018లో గాయబ్. కానీ ఇప్పుడు మళ్లీ ఆమె తెలుగు సినిమా ఒకటి కమిటైంది.

ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పటం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంతకీ ఏ హీరో సరసన ఆమె నటించబోతోంది అంటే ..యంగ్ హీరో నితన్ సరసన అని తెలుస్తోంది.

డిఫెరెంట్ చిత్రాలతో తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రకుల్ ఓకె చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం డిస్కషన్ స్టేజిలో ఈ ప్రాజెక్ట్‌పై అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇక నితిన్ విషయానికి వస్తే… వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మాతో పాటు ఏలేటి సినిమాని కూడా ఒకే సమయంలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. భీష్మాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.