శ్రీవారిని సేవలో నిహారిక , చైతన్య !

కొత్త దంపతులైన కొణిదెల నిహారిక ,చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు శ్రీవారి సేవలో పాల్గొని , ఆ శ్రీవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇదిలా ఉంటే , మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యల వివాహ వేడుకను డిసెంబర్‌ 9న జైపూర్‌లోని ఉదయ్‌ విలాస్‌ ప్యాలెస్ ‌లో ఘనంగా నిర్వహించారు. అనంతరం డిసెంబర్‌ 11 న హైదరాబాద్‌ లో రిసెప్షన్‌ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సినీ ప్రముఖలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు