వారితోనే సమాజానికి మంచి.. సోమరిబోతులపై నాగబాబు ప్రశంసలు

Nagababu About Lazy fellows: చిరంజీవికి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్‌కు అన్నయ్యగా నాగబాబు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. టవర్ స్టార్, నవ్వుల నవాబుగా ఎంత గుర్తింపు తెచ్చుకున్న మెగా బ్రదర్‌గా ఉండే ఇమేజే ఎక్కువ. అయితే నాగబాబు ఈ మధ్య మరో వర్మలా తయారవుతున్నాడు. ఏ ట్వీట్ చేసినా, ఏ కామెంట్ చేసినా సంచలనంగా మారుతోంది. ఆ మధ్య గాంధీ, గాడ్సే, నాస్తికులు, దేవుళ్లు, బాలయ్యలపై చేసిన కామెంట్స్ ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికీ తెలిసిందే.

Nagababu About Lazy fellows
Nagababu About Lazy fellows

తాజాగా నాగబాబు ప్రకటలను గురించి వివరించాడు. కొన్ని యాడ్స్ తనకు ఎంతో నచ్చాయని, వాటి కాన్సెప్ట్ చాలా బాగుంటుందని వివరించాడు. అందులో ఒకటి ఏంటంటే.. క్యాడ్బరీ 5 స్టార్ చాక్లెట్ యాడ్. 5 స్టార్స్ యాడ్స్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఆ మధ్య రమేష్ సురేష్ ఎంత క్రేజీగా మారిందో అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం ఓ ప్రకటన వైరల్ అయింది. ఓ కుర్రాడు చాక్లెట్ తింటూ ఉంటుంటే.. ఓ వృద్దురాలి చేతికర్ర దూరంగా పడిపోవడంతో ఇవ్వమంటుంది.. ఇక ఎంతసేపటికి ఇవ్వకపోడంతో ఆ బామ్మే వచ్చి తీసుకోవడం, అంతలోపే పైనుంచి పెద్ద వస్తువు ఆమె కూర్చున్న చోట పడటం.. దాంతో ఆశ్చర్యపోయిన బామ్మ.. ఏం చేయకుండా ఉన్నావ్, చాలా థ్యాంక్స్ అంటుంది.

ఆ యాడ్‌పై నాగబాబు స్పందిస్తూ.. ‘సోమరిబోతుగా ఉండటమే మంచిది.. ఏదో సాధించాలి ఎంతో సంపాదించాలని అనుకునేవారితోనే ఈ సమాజానికి ప్రమాదం. అలాంటి వాళ్లు తమ అభివృద్ది కోసం ప్రకృతిని నాశనం చేస్తుంటారు. అదే సోమరిబోతు అయితే కేవలం వారి కుటుంబానికి నష్టం వాటిల్లుతుంది.. కానీ ఇలాంటి వ్యాపారస్థుల వల్ల ప్రపంచానికే హాని కలుగుతుంది. అభివృద్ది పేరిట అంతా నాశనం చేస్తున్నారు.. అందుకే సోమరిబోతులే సమాజానికి మేలు చేస్తున్నారు’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.