మెగా బ్ర‌ద‌ర్ మౌనం దేనికి సంకేతం?

రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ప‌వ‌ర్ స్టార్` సినిమా విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు-వ‌ర్మ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో స్టిల్ వార్ కొన‌సాగుతూనే ఉంది. డేలో ఒక్క‌సారైనా త‌ల‌ప‌డుతున్నారు. వ‌ర్మ స‌వాల్ ని స్వీక‌రించిన అభిమానులు ఆయ‌న ఆఫీస్ పై కూడా దాడి చేసారు. సినిమా రిలీజ్ కు ముందు మొద‌లైన వివాదం రిలీజ్ త‌ర్వాత య‌థావిథిగా కొన‌సాగుతోంది. అయితే ఇంత జ‌రుగుతున్నా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు. మెగా ఫ్యామిలీలో ఎవ‌ర్నీ టార్గెట్ చేసి ముందుగా నాగ‌బాబు రియాక్ట్ అవుతారు. త‌న‌దైన శైలిలో టార్గెట్ పై తుపాకీ ఎక్కుపెట్టి తూటాలు వ‌ద‌లుతారు.

ఇటీవ‌లే న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ సినీ పెద్ద‌లు సీఎం కేసీఆర్ ని క‌లిసిన నేప‌థ్యంలో ఆ భేటీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తే వాటికి ధీటుగా నాగ‌బాబు బ‌ధులిచ్చారు. బాల‌య్య వ్యాఖ్య‌ల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని మండిప‌డ్డారు. అభిమానుల మ‌ధ్య ఈ అంశం వివాదాస్ప‌దంగా మారింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రు హీరోల అభిమానులు మ‌ధ్య పెద్ద వార్ న‌డిచింది. చివ‌రికి ఆ వివాదం కూల్ అయింద‌నుకోండి. అయితే ఇప్పుడు వ‌ర్మ విష‌యంలో నాగ‌బాబు మాట్లాడ‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొస్తుంది. నాగ‌బాబు ఎందుకు మాట్లాడ‌లేదు? ఆయ‌న నోరు నొక్కేస్తున్నారా? అన్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు.

అయితే వ‌ర్మ‌ని మూడేళ్ల క్రిత‌మే అక్కుప‌క్షి గా నాగ‌బాబు అభివ‌ర్ణించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఈ ప‌దం బాగా ట్రెండింగ్ లో నిలిచింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ ప‌దాన్నే ఉప‌యోగించి వ‌ర్మ‌పై సెటైర్ వేసాడు నాగ‌బాబు. ప్రస్తుతం నాగబాబు ‘జీ తెలుగులో అదిరింది కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఆదివారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో కమెడియన్ ధనరాజ్ ఈ అక్కు పక్షిని వాడేశాడు.‘అక్కు పక్షి అంటే అది ఏ రకానికి జంతువు అండీ’ అని ధనరాజ్‌ని తన టీం సభ్యుడు అడగ్గా.. ‘దానికి నామకరణం చేసిన ఆయన్నే అడగాలి’ అని నాగబాబుని చూపించడంతో అప్ప‌టి అక్కు ప‌క్షి గుర్తొచ్చింది.