- ఊహించని ముప్పుతో
సాహోటీమ్ ఉక్కిరి బిక్కిరి
సాహో ప్రెస్ మీట్ మీడియా బోయ్ కాట్
ఏమిటీ గొడవ? ఇంత ప్రతిష్ఠాత్మక చిత్రానికి?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సాహో ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళం-హిందీ సహా దేశంలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తమిళంలోనూ ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. బాహుబలి తర్వాత అంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
<
p style=”text-align: justify”>అయితే ఊహించని ముప్పు సాహో నిర్మాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని తెలుస్తోంది. నేడు చెన్నయ్ లోని ఓ స్టార్ హోటల్లో సాహో తమిళ వెర్షన్ ప్రీరిలీజ్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే అక్కడ మీడియా నుంచి ఊహించని చిక్కులు వచ్చి పడ్డాయట. కోలీవుడ్ మీడియా ప్రస్తుతం సాహో ప్రెస్ మీట్లను బహిష్కరించిందని తెలుస్తోంది. తమిళ నిర్మాతల సంఘంతో ప్రస్తుతం సినీమీడియాకి అస్సలు పొసగడం లేదు. గత కొంతకాలంగా నిర్మాతలకు మీడియాకు మధ్య సీరియస్ గా గొడవలు జరుగుతున్నాయి. మీడియా కోసం కేటాయించాల్సిన బడ్జెట్ అదనపు ఖర్చుల్ని కోసేస్తూ తమిళ నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో మీడియా వాళ్లు అంతా అక్కడ తీవ్రమైన కోపంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిణామం సాహో తమిళ వెర్షన్ పై తీవ్రంగా పడనుందని ప్రచారం సాగుతోంది. అయితే సాధ్యమైనంత వరకూ సాహో తమిళ వెర్షన్ నిర్మాతలు మీడియాని బుజ్జగించే పనిలో ఉంది. కానీ మీడియా వాళ్లు మాత్రం ససేమిరా అనేస్తున్నారట. కారణం ఏదైనా సాహోకి ఊహించని చిక్కులొచ్చి పడ్డాయ్. పులి మీద పుట్రలా ఈ కొత్త ఇబ్బందులు సమస్యాత్మకంగా మారనున్నాయని అర్థమవుతోంది. కేవలం తమిళనాడు నుంచి దాదాపు 200 కోట్లు కొల్లగొట్టాల్సిన సినిమా మీడియా నెగెటివ్ ప్రచారంతో ఎలాంటి ముప్పును ఎదుర్కొంటుందోనన్న సందేహం నెలకొంది.
