స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడం అన్నది డైరెక్టర్ మారుతికి ఓ డ్రీమ్ లాంటింది. అల్లు అరవింద్ కుటుంబానికి దూరపు బంధువే అయినా… చెప్పుకోదగ్గ సక్సెస్ మారుతి ఖాతాలో ఉన్నా! అతని కథలపై బన్నీ అంతగా ఏనాడూ ఆసక్తి చూపించలేదు. దీంతో బన్నీ తో ఎలాగైనా ఓ సినిమా చూసి పెద్ద విజయాన్ని అందించాలని మారుతి ఓ డ్రీమ్ గా పెట్టుకున్నాడు. అరవింద్ ఫ్యామిలీ తనని నమ్మాలంటే బన్నీకి ఓ పెద్ద సక్సెస్ ఇచ్చి మాట్లాడాలి తప్ప మరో మార్గం లేదని నాలుగైదేళ్లుగా అతడి కోసం కథపై పనిచేస్తున్నాడు. ఇప్పటికే బన్నీ కి చాలా కథలు వినిపించాడు. కానీ ఏదీ బన్నీని సంతృప్తిపరచలేదు.
తాజాగా మరోసారి మారుతి మరో కొత్త కథతో బన్నీ వెంటపడుతున్నాడు! అన్న వార్త టాలీవుడ్ ని హీటెక్కిస్తోంది. బన్నీ దూరం దూరం అంటున్నా..మారుతి దగ్గరకొస్తానంటూ షంటేస్తున్నాడుట. బన్నీకి బాగా సన్నిహితంగా మెలిగే ఓ మీడియేటర్ ద్వారా తన లైన్ వినిపించమని పంపించాడుట. నేరుగా మారుతి అప్రోచ్ అయితే బన్నీ ఎందుకనో ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు గతంలో చేయడంతో! ఈసారి అలా కాకుండా బన్నీ కి బాగా క్లోజ్ అయిన వ్యక్తినే రంగంలోకి దింపాడుట. మారుతి పంపించిన లైన్ మధ్యలో వ్యక్తి ద్వారా బన్నీ వింటాడుట. అది నచ్చితే మారుతి బన్నీ అపాయింట్ మెంట్ తీసుకుని డైరెక్ట్ గా మీట్ అవుతాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం బన్నీ రేంజ్ అంతకంతకు పెరుగుతోంది. `నా పేరు సూర్య` ప్లాప్ తర్వాత ఎలాంటి ఫేజ్ లో కి వెళ్లిపోయాడో తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకుని `అల వైకుంఠ పురం` స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకోవడానికి సమయం పట్టింది. ఆ సక్సెస్ బన్నీకి ఊరటనిచ్చింది. తదుపరి ఇదే స్పీడ్ ను కొనసాగించాలని చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఫక్తు సస్పెన్స్ థ్రిల్లర్ . రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమా. దీంతో బన్నీ ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నాడు. పైగా బన్ని తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం బహుభాషా చిత్రాలతో అనుభవం ఉన్న వారికే అవకాశాలిచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో మారుతి వినిపించే స్క్రిప్టు వింటాడా? కాల్షీట్లు ఇస్తాడా? అన్నది వేచి చూడాలి.