మ‌న్మ‌ధుడు 2` సెన్సార్ టాక్… ఇంట్రెస్టింగ్ లీక్!

మ‌న్మ‌ధుడు 2` సెన్సార్ టాక్… ఇంట్రెస్టింగ్ లీక్

కింగ్ నాగార్జున‌- ర‌కుల్ ప్రీత్ జంట‌గా రాహుల్ `చి.ల‌.సౌ` ఫేం ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించిన‌ చిత్రం `మ‌న్మ‌ధుడు 2`. ఆగ‌స్టు 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `మ‌న్మ‌ధుడు`కి సీక్వెల్ .. ప్రీక్వెల్ కాని క‌థ‌తో తెర‌కెక్కుతోంది. ఇదో రొమాంటిక్ కామెడీ జోన‌ర్ మూవీ. ఇందులో ల‌వ్, ఎమోష‌న్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫ‌న్ ఇలా అన్ని వ‌ర్గాలు మెచ్చే అంశాలు ఉంటాయ‌ని నాగార్జున చెబుతున్నారు. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. యుఏ స‌ర్టిఫికెట్ ని జారీ చేశారు.

కింగ్ చెప్పిన‌ట్టే ఈ చిత్రంలో ఫ‌న్ ఎలిమెంట్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని సెన్సార్ లీక్ అందింది. రొమాన్స్ కాస్తంత ఘాటుగానే ఉంటుందిట‌. యూత్ కి క‌నెక్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ర‌కుల్ గ్లామ‌ర్ ట్రీట్.. కింగ్ రొమాన్స్ అద‌ర‌హో అన్న ముచ్చ‌ట సాగుతోంది. అయితే ఇది అర్బ‌న్ కి బాగా క‌నెక్ట‌వుతుంది. రెగ్యుల‌ర్ మాస్ కంటే రీచ‌బులిటీ క్లాస్ వ‌ర్గాల‌కే ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే ఆన్ లైన్‌లో టిక్కెట్ల అమ్మ‌కాలు సాగుతున్నాయి. దాదాపు 21 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం తొలి వీకెండ్ నాటికే ఆ మేర‌కు షేర్ వ‌సూలు చేయాల్సి ఉంటుంది. తొలి వీకెండ్ తోనే పంపిణీదారుల్ని సేఫ్ జోన్ కి తేవాలంటే ఆరంభ‌మే హిట్ టాక్ రావాలి. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ తో క‌లిసి జెమిని కిర‌ణ్ నిర్మించారు.