క్లారిటీ వచ్చేసింది, టూర్ కాన్సిల్ చేసిన నాగ్

నాగార్జున కు విషయం అర్దమయ్యే…కాన్సిల్ చేసేసాడు

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9విడుదలైన సంగతి తెలిసింమదే. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ఈ ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

‘చి.ల.సౌ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మన్మధుడు 2 కి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మెల్లి మెల్లిగా కలెక్షన్ డ్రాప్ అవటం మొదలయ్యాయి.

అప్పటికీ నాగార్జున ఈ సినిమాని అన్నమయ్యతోనూ మరో సినిమానూ పోల్చి..కలెక్షన్స్ పికప్ అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. దాంతో టీమ్ కాస్త ఉత్సాహం తెచ్చుకుని థియోటర్స్ కు సక్సెస్ టూర్ కు వెళ్దామని అనుకుని ప్లాన్ చేసారు. అయితే లాస్ట్ మినిట్ లో నాగ్ నో చెప్పేసారని సమాచారం. కలెక్షన్స్ మరింత తగ్గిపోయాయని, టాక్ బాదా దారుణంగా స్ర్పెడ్ అయ్యిందని గమనించిన నాగ్ ఇలా వద్దన్నారని చెప్తున్నారు. మరో ప్రక్క రేపటి నుంచీ రణరంగం,ఎవరు వంటి చిత్రాల విడుదల నేపథ్యంలో మన్మధుడు 2 కలెక్షన్స్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.