`మా` ఎఫెక్ట్‌తో ఎమోష‌న‌ల్‌…

ఈ నెల 10న జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌ల్లో నరేష్ ప్యానెల్..శివాజీ రాజా ప్యానెల్‌పై ఘ‌న విజయాన్ని సాధించింది. ఎన్నిక‌లు తర్వాత శివాజీ రాజా వ‌ర్గం చాంబ‌ర్ ప‌రిధిలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రీసెంట్‌గా శివాజీ రాజా ప్రెస్‌మీట్ పెట్టి భావోద్వేగానికి గుర‌య్యారు. తాను త‌న కుటుంబంతో అరుణాచ‌లం వెళ్లిపోదామ‌ని అనుకున్న స‌మ‌యంలో, అంద‌రూ ఒక్క‌సారి ఉండ‌మ‌ని బ్ర‌తిమాల‌డంతో స‌రేన‌ని ఒప్పుకున్నాన‌న్నారు శివాజీ రాజా. “నేను, శ్రీకాంత్ ప్రాణం పోయినా త‌ప్పు చేయం. మా అటెన్‌డెన్స్ 70-80 శాతం ఉంటే, మెయిన్ ప‌ద‌వుల్లో ఉండేవారి అటెన్‌డెన్స్ 20 శాతం మాత్ర‌మే ఉంది. చెడ్డ పేరు రాకుండా ఉండ‌టానికి అన్నీ ప‌నులు చేసుకుంటూ వ‌చ్చాం. న‌రేష్ నా సోద‌రుడే. నిన్న‌టి వ‌ర‌కు ఒకే శాలువా క‌ప్పారు.. ఒకే దండ వేశారు“ అని తెలిపారు శివాజీ రాజా.