కౌసల్య కృష్ణమూర్తి ప్రీ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ

కౌసల్య కృష్ణమూర్తి ప్రీ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ

కె .ఎస్ .రామా రావు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న “కౌసల్య కృష్ణ మూర్తి ” సినిమా ప్రీ ఈవెంట్ కార్యక్రంలో విజయ దేవరకొండ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు . ఐశ్వర్య రాజేష్ కౌసల్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ మూర్తిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు . క్రీడా నేపధ్యలో తమిళం లో నిర్మించిన “కన్నా ” చిత్రాన్ని కె. వల్లభ నిర్మాతగా తెలుగులో రూపొందిస్తున్నారు . ఇందులో ఐశ్వర్య రాజేష్ , శివ కార్తికేయన్ తెలుగులో పరిచయమవుతున్నారు .
ఈ చిత్ర ప్రీ ఈవెంట్ ను హైద్రాబాద్లో ఆదివారం నాడు భారీగా జరుపుతున్నారు . విజయ దేవరకొండతో పాటు పలువురు సినిమా రంగ ప్రముఖులు ఈ కార్యక్రంలో పాల్గొంటున్నారు . “కౌసల్య కృష్ణ మూర్తి ” సినిమాను ఆగష్టు 23న విడుదల చెయ్యబోతున్నారు .