Aishwarya Rajesh : ఐశ్వర్యా రాజేష్ టాలీవుడ్‌ని అందుకే లైట్ తీసుకుంటోందా.?

Aishwarya Rajesh
Aishwarya Rajesh

అసలు సిసలు తెలుగమ్మాయ్ అయినప్పటికీ, ఐశ్వర్యా రాజేష్ తమిళనాట స్టార్ హీరోయిన్‌గా సెటిలైపోయింది. ఇప్పుడిప్పుడే తెలుగులో ఒకటీ అరా సినిమాలు చేస్తోంది.

ఆల్రెడీ గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, హీరోయిన్‌గా మాత్రం ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాతో ఈ అమ్మడు తెలుగు నాట అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో శీనయ్య పాత్రకు భార్యగా నటించి మళ్లీ ఆకట్టుకుంది.

లేటెస్టుగా నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాలో నాని మేనకోడలిగా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది.అన్నీ ఆకట్టుకునే పాత్రలే అయినప్పటికీ, అవన్నీ హోమ్లీ పాత్రలే కావడంతో, మళ్లీ మళ్లీ ఐశ్వర్యకు అలాంటి ఆపర్లే వస్తున్నాయట. దాంతో కొన్నాళ్లు టాలీవుడ్‌ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటోందట.

ఈ లోగా కోలీవుడ్‌లో చేయాల్సిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలనుకుంటోందట. అక్కడ ఆమె చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్టులున్నాయి. స్టార్ హీరోలతో పాటు, క్రేజీ యంగ్ హీరోస్‌తోనూ జత కడుతోంది. అందుకే కొన్నాళ్లు టాలీవుడ్‌ నుండి గ్యాప్ తీసుకోవాలనుకుంటోందట.

ఇక ప్రస్తుతం తెలుగులో ఐశ్వర్యా రాజేష్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎన్నారై మైరా పాత్రలో మెచ్చూర్డ్ లుక్స్‌తో ఆకట్టుకోనుంది ఐశ్వర్య ఈ సినిమాలో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి దేవకట్టా దర్శకుడు.