ఆ కోట లో మహేష్ బాబు రష్మిక శృంగారం

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ “

“రాజు తలుచుకుంటే డబ్బాలకు కొదువేముంది” అనేది ఒకప్పటి సామెత. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు డబ్బులకు కొదవ ఏముంది అని చెప్పుకోవాలి . మెష్ బాబు సినిమా అంటేనే 125 కోట్లు ఖర్చు పెడుతున్నారు . ఒకరకంగా మహేష్ సినిమాలు హిందీ సిని మాలతో పోటీపడుతున్నాయి . ఇప్పుడు మహేష్ బాబు, రష్మిక మందన్న తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు , అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తయారవుతుంది .

మొదటి షెడ్యూల్ ఈ మధ్యనే కాశ్మీర్ లో పూర్తి చేశారు . రెండవ షెడ్యూలు ఈ నెల 26 నుంచి హైద్రాబాద్ లో మొదలవుతుంది . ఈ సినిమాలో చాల సంవత్సరాల తరువాత విజయ శాంతి నటిస్తున్నది . “సరిలేరు నీకెవ్వరూ ” సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారు . ఇది నిర్మాణ దశలో వుంది . కర్నూల్ నగరంలో వున్న కొండారెడ్డి బురుజును ఇక్కడ సృష్టిస్తున్నారు . ఈ సెట్ సుమారు నాలుగు కోట్ల రూపాయలు అవుతుందని తెలుస్తుంది . వందలమంది కార్మికులు కళా దర్శకుడు పర్యవేక్షణలో పనిచేస్తున్నారు . ఈ సినిమాలో కొన్ని భాగాలు చిత్రీకరించిన తరువాత ఈ బురుజు దగ్గర మహేష్ , రష్మిక మందన్న పాల్గొనే శృంగార సన్ని వేశాలు తీస్తారని తెలుస్తుంది .