ప్ర‌భాస్ కు జోడీగా కియారా!

ప్ర‌భాస్ కు జోడీగా కియారా!

ప్ర‌భాస్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంట‌సీ `రాధేశ్యామ్‌`.  జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఓ కాల్పనిక ప్రేమ‌క‌థ‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా  పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కీల‌క షెడ్యూల్ జార్జియాలో ముగించారు. త‌దుప‌రి షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ఇందు కోసం అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో ప్యాలెస్ సెట్‌ని ఎంతో భారీగా, అందంగా నిర్మించారు.

అయితే  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షెడ్యూల్ అంతా ఆగిపోయింది. యూనిట్ మొత్త బాగా అప్సెట్ అయింది. వచ్చే ఆగ‌స్టు లో తిరిగి షూటింగ్ ప్రారంభించాల‌ని చిత్ర బృందం ఏర్పాట్లు చేసుకుంటోంది. యువీ క్రియేష‌న్స్‌, గోపీ కృష్టా మూవీస్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ త‌న 21వ చిత్రాన్ని `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సి. అశ్వ‌నీద‌త్ పాన్ ఇండియాకు మించి తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్‌కు జోడీ గా  మొదట్లో బాలీవుడ్ భామ దీపికా ప‌దుకునే ని ఎంపిక చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీపిక భారీగా డిమాండ్ చేయ‌డంతో ఆమె స్థానంలో కియారా అద్వానీని సంప్రదించారని, కియారా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్ర‌భాస్-కియారాల జోడీ వెండితెరపై వెలుగులు విరజిమ్మడం ఖాయమని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.