కార్తికేయ ఇలా షాక్ ఇచ్చాడేంటి? పబ్లిసిటి స్టంట్ కాదు కదా

కార్తికేయ ఇలా షాక్ ఇచ్చాడేంటి? పబ్లిసిటి స్టంట్ కాదు కదా

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో హిట్ కొట్టి తెలుగు వాళ్లకు దగ్గరైన హీరో కార్తికేయ. అయితే ఇమ్మీడియట్ గా వచ్చిన ‘హిప్పీ’ చిత్రం డిజాస్టర్ అవటంతో తన మూడో సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సారి ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో ముందుకొచ్చాడు. అదే ‘గుణ 369’. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను శిష్యుడు ‘అర్జున్ జంధ్యాల’ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఓపినింగ్స్ పెద్దగా తెచ్చుకోలేని ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో తనకు మరో విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు హీరో కార్తికేయ.

అంతవరకూ బాగానే ఉంది… అక్కడితో ఆగకుండా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి షేర్ చేసాడు ఈ యంగ్ హీరో. తన తరువాత చిత్రంకు సంబంధించిన వార్త ఇది. ఆ చిత్రం ఎవరితో చేయబోతున్నాడో అన్నది రివీల్ చేసి షాక్ ఇచ్చాడు కార్తికేయ.

గుణ 369 తో తనలోని మాస్ యాంగిల్ ని బయటకి తీసి మంచి హిట్ అందించిన అర్జున్ జంధ్యాల తోనే కార్తికేయ 4వ చిత్రం ఉండబోతుందట. అది ఎప్పుడు మొదలవుతుందో త్వరలోనే వెల్లడిస్తాను అని చెప్పాడు కార్తికేయ. ఈ చిత్రం సక్సెస్ ను ఎప్పటికీ మరువలేనని, దీన్ని తలకి ఎక్కించుకోకుండా ఇకనుంచి ప్రతి చిత్రానికి నూటికి నూరు శాతం శ్రమిస్తానని చెప్పాడు. ఇది విన్న వాళ్లంతా షాక్ అవుతున్నారు. సినిమాకు డివైడ్ టాక్ ఉన్నా..తన తదుపరి చిత్రం దర్శకుడుగా ప్రకటించటం ..పబ్లిసిటీ స్టంటా అని అంటున్నారు.