శ‌త్రువు కంగ‌న‌పైనా క‌ర‌ణ్ సైబ‌ర్ క్రైమ్‌కి ఫిర్యాదు?

క‌ర‌ణ్ జోహార్ వ‌ర్సెస్ కంగ‌న ర‌నౌత్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. న‌ట‌వార‌స‌త్వాన్ని ఎంక‌రేజ్ చేసే క‌ర‌ణ్ జోహార్‌కి కంటిపై కునుకుప‌ట్ట‌నీకుండా చేయ‌డంలో క్వీన్ కంగ‌న బొమ్మాళీనే త‌ల‌పిస్తోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక‌ మ‌ర‌ణానంత‌రం కంగ‌న మ‌రింత‌గా చెల‌రేగుతోంది. సుశాంత్ సింగ్ ని ఫ్లాప్ హీరో అని ముద్ర వేసిన క‌ర‌ణ్ ని ఏకేస్తోంది. త‌న‌కు అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని జార‌విడుచుకోకుండా చెడుగుడు ఆడేస్తోంది. బాలీవుడ్ మాఫియా అంటూ క‌ర‌ణ్ జోహార్ ని ఆయ‌న తొత్తులైన ప‌లు బాలీవుడ్ కుటుంబాల్ని అల్లాడిస్తోంది. అందుకే ఆవిడ‌ను క్వీన్ అంటూ పొగిడేస్తూ చాలామంది అండ‌గా నిలుస్తున్నారు.

అయితే త‌న‌ను సోష‌ల్ మీడియాల్లో బూతులు తిడుతూ ర‌క‌ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సుశాంత్ అభిమానుల‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు క‌ర‌ణ్ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అమాయ‌కులైన ఆవేశ‌ప‌రులైన అభిమానుల‌పై ఇలా క‌ర‌ణ్ క‌క్ష తీర్చుకోగ‌ల‌డేమో కానీ బాలీవుడ్ బండిట్ క్వీన్ కంగ‌న‌పై ప‌గ తీర్చుకోగ‌ల‌డా? కంగ‌న‌ను అరెస్ట్ చేయాలంటూ సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసే ద‌మ్ముందా? అంటూ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు ఓ సెక్ష‌న్ అభిమానులు.

భ‌న్సాలీ.. రోష‌న్ లు.. చోప్రాలు.. ఖాన్ లు చేయ‌లేనిది జోహార్ చేసి చూపిస్తాడా? అయినా క‌ర‌ణ్ కి కంగ‌న ముందుకెళ్లే ద‌మ్ముందా? అత‌డికి అన్ని గుండెలు ఉన్నాయా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఎపిసోడ్ బై ఎపిసోడ్ వేడెక్కించేస్తున్నాయ్. ఇంత‌కీ సుశాంత్ సింగ్ ది ఆత్మ‌హ‌త్య‌నా? లేక కంగ‌న ఆరోపించిన‌ట్టు బాలీవుడ్ మాఫియా వ‌ల్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణ‌మా? అన్న‌దానికి పోలీసులు స‌మాధానం చెబుతారంటారా? బాలీవుడ్ లో బ‌య‌టి ట్యాలెంటును తొక్కేస్తున్న‌ చోప్రాలు.. భ‌న్సాలీల్ని.. ఖాన్ లను పోలీసులు విచారించాల‌ని కంగ‌న కోరారు. దానికి కూడా పోలీసులు స్పందించాల్సి ఉంది.