రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో కాస్త స్లో అయ్యారు. బాలీవుడ్ మీద దృష్టి పెట్టి టాలీవుడ్కు దూరమైన ఈ బ్యూటీ తరువాత యంగ్ హీరోల సరసన అవకాశాలు తగ్గటంతో సీనియర్ హీరోతో జత కట్టేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మథుడు 2లో నటిస్తున్న ఈ భామ త్వరలో మరో తమిళ్ మూవీ లో సీనియర్కు జోడిగా నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజాగా కాజల్కు బదులుగారకుల్ ప్రీత్ సింగ్ను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రకుల్ కూడా కమల్ తో చేయటానికి అదృష్టం గా భావించింది. త్వరలోనే షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు.