పెళ్లిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిన ఎన్టీఆర్ వాచ్, రేటు

దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ వివాహం డిసెంబర్‌ 30న అంగరంగ వైభవంగా జరుగనుంది. జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కార్తికేయ వివాహం జరుగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరు అయ్యారు. ఈ పెళ్లి గురించిన వార్తలు ,విశేషాలు రావటం మానేసి ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న వాచ్ గురించి మీడియా మాట్లాడుతోంది. ఆ విషయమే హైలెట్ అయ్యింది.

ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు..సినీ అభిమానులందిరిలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మొదట నుంచీ ఎన్టీఆర్ కు కొత్త కొత్త వాచీలంటే ఇంట్రస్ట్ ఉంది. ఆయన ఎక్కడెక్కడ డిజైన్స్ తెప్పించుకుంటారు. ఎంత రేటు అయినా పట్టించుకోరు. ఈ నేపధ్యంలో ఆయన చేతిని ఓ కొత్త వాచి అలంకరించింది. ఆ వాచి రేటు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ కొత్త వాచి విషయం జైపూర్ లో బయిటపడింది.

వివరాల్లోకి వెళితే.. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం కోసం తెలుగు సిని ప్రముఖులంతా జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ను చూసి కొందరు ఆశ్చర్యం పోయారు. దాని ధర తెలుసుకుని అవాక్కయ్యారు. ఆ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీదని తెలుస్తోంది. ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు అత్యంత ఖరీదైన ఈ వాచ్ లను ధరిస్తుంటారు. దీని ధర అక్షరాలా రూ. 2.20 కోట్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కి రకరకాల ఖరీదైన లగ్జరీ రిస్ట్ వాచీలంటే చాలా ఇష్టం. తనకి ఇష్టమైనవారికి ఆయన అలాంటి రిస్ట్ వాచీలను గిఫ్టుగా ఇస్తుంటాడు. ‘జనతా గ్యారేజ్’ సినిమా సమయంలోనూ ఆయన కొరటాల శివకి ఒక రిస్ట్ వాచీని కానుకగా ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు.అలాగే లవకుశ దర్శకుడు బాబీకి కూడా ఎన్టీఆర్ ఒక లగ్జరీ రిస్ట్ వాచీని గిఫ్ట్ గా ఇచ్చినట్టు మీడియాలో వచ్చింది.