అల్లు శిరీష్ .. ‘జాతి రత్నం’..ఇదో రకం వెటకారం

ప్రస్తుతం అల్లు శిరీష్ ని జాతిరత్నం చేసే పనిలో దర్శకుడు మారుతి ఉన్నారట. గతంలో వీరిద్దరి కాంబోలో కొత్తజంట చిత్రం వచ్చింది కానీ అది నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత మారుతి వరస హిట్స్ ఇచ్చారు. దాంతో అల్లు శిరీష్ కు హిట్ ఇవ్వమని అల్లు అర్జున్ పురమాయించారట. అందుకోసం జాతి రత్నం టైటిల్ తో ఓ కథ రెడీ చేసారట మారుతి. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తైందని,కానీ టైటిల్ మరీ ఎటకారంగా ఉందని, మారిస్తే బాగుంటుందని సూచించారట. కానీ జనాల్లోకి రీచ్ వెళ్లాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు.

మరో ప్రక్క అల్లు అరవింద్ మాత్రం పూర్తి నేరేషన్ మరోసారి విని ఫైనల్ చేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అల్లు శిరీష్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పుడు శిరీష్ కు కావాల్సింది మామూలు హిట్ కాదు మెగా హిట్. అందుకోసం అరవింద్ ఎదురుచూస్తున్నారు. అల్లు శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్క శ్రీరస్తు శుభమస్తు ఒక్కటే కావటం విశేషం.

ఆ తర్వాత ఎక్సపెక్టేషన్స్ తో చేసిన ఒక్క క్షణం డిజాస్టర్ అయ్యి మెగా ఫ్యామిలీని బాగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఏబిసిడి రీమేక్ లో నటిస్తున్న శిరీష్ దాని ఫినిషింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా రీమేక్ కావటంతో క్రేజ్ బాగానే ఉంది. ఇప్పటికే మంచి రేట్ కి శాటిలైట్ డీల్ క్లోజ్ కావడంతో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు.

సినిమా ఏ మాత్రం ఆడినా దాన్ని తమ పబ్లిసిటీతో ఎక్కడికో తీసుకువెళ్లాలని అల్లు అరవింద్ రెడీ గా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు శిరీష్ మాత్రం ఆ అవకాసం ఇవ్వటం లేదు. మరి మారుతి సినిమాతో అయినా అల్లు అరవింద్ కోరిక తీరుతుందా చూడాలి.