ట్రెండీ టాక్‌: త్రిష శింబుని పెళ్లాడ‌బోతోందా?

సమంతా, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ల‌ను మించి త్రిష కృష్ణన్ కి సోష‌ల్ మీడియాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఇద్ద‌రి కంటే త్రిష పెద్ద స్టార్. గొప్ప అభిన‌య నేత్రిగా త్రిష‌ను అభిమానులు ఆరాధిస్తారు. అయితే, ఇటీవ‌ల ఈ బ్యూటీ ఒకానొక‌ సమయంలో తన రేంజును కోల్పోయింది. స్టార్ డ‌మ్ ప‌రంగా కెరీర్ ప‌రంగా రేసులో వెనుకంజ వేసింది.

ఆ క్ర‌మంలోనే త్రిష సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ పెంచింద‌నే చెప్పాలి. మ‌ళ్లీ పాత రోజుల్ని తిరిగి ర‌ప్పించే ప్ర‌య‌త్నంలో ఉందీ భామ‌. కంబ్యాక్ కోసం గ‌ట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఇటీవ‌లే చిరంజీవి స‌ర‌స‌న న‌టించే గొప్ప అవ‌కాశాన్ని కావాల‌నే చేజార్చుకుంది త్రిష‌. ఆచార్య చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని  కోల్పోయింది.

అయితే ఈ జ్ఞాప‌కాల‌న్నిటినీ ప‌దిల‌ప‌ర్చిన సోష‌ల్ మీడియాల్లో ఆ పోస్టుల్ని త్రిష డిలీట్ చేయ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా విష‌యాల‌పై త్రిష ఇంతకు ముందు పోస్ట్ చేసిన ట్వీట్లన్నీ ఆమె టైమ్‌లైన్ నుండి అదృశ్యమయ్యాయంటే దానికి కార‌ణ‌మిటో ఊహించేదే.

త్రిష‌ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇప్ప‌టికి 100 ఫోటోల్ని పోస్ట్ చేసింది. వీటిలో ఏడు పోస్టులు మినహా అవన్నీ అదృశ్యమయ్యాయి. త్రిష ఎందుకిలా చేస్తోందో అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే కావాల‌నే ఇలా పోస్టులు డిలీట్ చేసింది. సోషల్ మీడియాను క్లీన్ చేస్తోంది. ఇలా చేయ‌డం ఖచ్చితంగా ఏదో ఒక సంకేతం అనే చెప్పాలి.

త్రిష త్వ‌ర‌లోనే ఎన‌ర్జిటిక్ హీరో శింబును వివాహం చేసుకుని, స్థిరపడేందుకు ప్లాన్ చేస్తోంద‌న్న గుస‌గుస‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీని కోసమే ఆమె కొత్తగా త‌న లైఫ్ ని ప్రారంభించాలనుకుంటున్నందున ఆమె తన సోషల్ మీడియా జీవితాన్ని క్లీన్ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పెద్ద విష‌యం ఏదో రివీల్ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నందున ఆమె వాటన్నింటినీ ప్రైవేట్ మోడ్‌లో ఉంచారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా, ఇన్‌స్టాలో త్రిష‌ను 2.4 మిలియన్ల మంది అనుస‌రిస్తున్నారు. ట్విట్టర్‌లో 5.4 మిలియన్ల మంది అభిమానులు ఫాలో చేస్తున్నారు. వీరంతా త్రిష చేసిన ఆ ప‌నికి తీవ్రంగా క‌ల‌త చెందుతున్నారు.