ప్రభాస్ ఫ్యాన్స్ ని కూల్ చేయటానికే ఈ నిర్ణయం?

ప్ర‌భాస్ చిత్రం సాహో ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ సినిమాకు రావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు. అదే బాహుబలికు అయితే ఈ పాటికి దేశం మొత్తం ఊగిపోయే ప్రమోషన్ జరిగింది. సాహో ఆ విషయంలో ఎందుకనో స్పీడ్ అవ్వటం లేదు. ఈ విషయమై అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ మేకింగ్ వీడియోస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. దీంతో వారిని కూల్ చేయడానికి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఈద్ కానుకగా టీజర్ వస్తుందని భావించారు కానీ చిత్ర యూనిట్ జూన్ 13న టీజర్ ని విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

ఈ మేరకు ప్రభాస్ తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ ద్వారా ఈ విషయం తెలియచేసారు. జూన్ 14 నుండి థియేటర్ లలో టీజర్ సందడి చేయనుంది. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సన్నివేశాలను ఇంటర్నేషనల్ స్దాయిలో నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.