ఎన్టీఆర్ సినిమాలో నేనూ ఉన్నా.. కాస్త నన్నూ పట్టించుకోండి…

సెలబ్రెటీలకు ముఖ్యంగా సినిమావాళ్లకు కావల్సింది పబ్లిసిటీ. అందుకోసం తమను తాము ప్రమోట్ చేసుకోవటానికి కూడా వెనక అడుగు వెయ్యరు. సోషల్ మీడియా వచ్చాక అది మరీ ఎక్కువైంది. ఇంతకు ముందు రోజుల్లో మీడియా వాళ్లకు కాస్తంత డబ్బులు ఇఛ్చి …తమమీద కథనాలు రాయించుకునేవారు. ఇప్పుడు సీన్ మారింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనిస్ట్రగ్రమ్ లో తమ సొంత డబ్బే తామే వాయించుకుంటున్నారు. అయితే
అది తప్పని అనలేం.

గ్లామర్ ఫీల్డ్ కు ఆ గ్రామర్ అవసరమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే…నేనూ ఎన్టీఆర్ కొత్త చిత్రంలో నటిస్తున్నానంటూ ఈష రెబ్బ  సోషల్
మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా పాటలు విడుదల చేస్తున్నారు. దాంతో తమన్ , ఎన్టీఆర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

ఆ పాటల్లో పూజ హెడ్గేని అక్కడక్కడా మెరిసేలా చేస్తున్నారు. ఇదంతా గమనించిన ఈషా రెబ్బా…ఎన్టీఆర్, త్రివిక్రమ్ లతో కలిసి దిగిన ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రక్కన ఎన్టీఆర్ ఉండటంతో ఖచ్చితంగా ఆ పిక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ అంతా ఆ పిక్ ని తమ పోస్ట్ లతో షేర్ చేసాకరని ఆమె అంచనా. ఇలాంటి అంచనాలు చాలా సార్లు నిజమే అవుతాయి.