బ‌యోపిక్‌ల‌పై సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు

                                                                         (ధ్యాన్

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తుంది. తెలుగులో రీసెంట్‌గా సావిత్రి బ‌యోపిక్ విడుద‌ల‌వ‌గా.. ఎన్టీఆర్‌, వై.ఎస్‌.ఆర్‌, కె.సి.ఆర్ బ‌యోపిక్‌లు విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్నాయి. అయితే ఈ బ‌యోపిక్‌లపై సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యాయి. గుంటూరులో ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సింగీతం మాట్లాడుతూ `బ‌యోపిక్‌ల‌ను డాక్యుమెంట‌రీల రూపంలో తీయాలి. కానీ అలా తీస్తే సినిమా ఆద‌ర‌ణ పొంద‌క‌పోవ‌చ్చు. అందుక‌ని డ్రామాను జోడించ‌డం వ‌ల్ల బ‌యోపిక్స్‌లో నాట‌కీయ‌త పెరిగిపోతుంది. వాస్త‌వికత లోపిస్తుంది` అన్నారు.