ప్రభాస్‌ పై క్రష్.. కానీ చెప్పలేకపోయా

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌పై చాలా మందికి క్రష్ ఉంటుంది. ముఖ్యంగా బాహుబలి రిలీజ్ అయ్యాక ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఆయన్ను తెగ ఇష్టపడుతూంటారు. అయితే సినిమా ఫీల్డ్ కు చెందిన వాళ్లు అలాంటిదేమన్నా మనస్సులో ఉన్నా పైకి చెప్పరు. కానీ మహిళా దర్శకురాలు నందీనీ రెడ్డి ఆ విషయం ఎలాంటి మొహమాటం లేకుండా బయిటపెట్టేసింది.

ప్రభాస్ తనకు క్రష్‌ ఉండేదని అంటున్నారు నందినీ రెడ్డి. ఆమె తెరకెక్కించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభాస్‌పై తనకు ఎప్పుడూ క్రష్‌ ఉండేదని.. కానీ ఈ మాటను ప్రభాస్‌కు చెప్పలేకపోయానని అన్నారు. ప్రభాస్‌ ఎదురుగా ఉంటే నోట మాట కూడా రాదని పేర్కొన్నారు. ప్రభాస్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. మరి ఈ విషయం విన్న ప్రభాస్ ఏమంటారో చూడాలి.

‘ఓ బేబీ’ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించారు. నాగశౌర్య, రావు రమేశ్‌, మాస్టర్‌ తేజ, రాజేంద్రప్రసాద్, లక్ష్మి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. జులై 5న ‘ఓ బేబీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.