కోన వెంక‌ట్‌ని చూస్తే చాలా జెల‌సీగా ఉంది…బాబీ

                                                               (ధ్యాన్) 

`జై ల‌వ కుశ‌`కు బాబీ (కె.య‌స్‌.ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బాబీ మ‌రే సినిమానూ మొద‌లుపెట్ట‌లేదు. వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య సినిమా ప్రారంభోత్స‌వం మాత్ర‌మే చేశారు. ఇంకా షూటింగ్ మొద‌లుకాలేదు. ఆ సినిమా స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు ఆయ‌న‌తో పాటు ప‌నిచేసిన కోన వెంక‌ట్ మాత్రం ఎంవీవీ సినిమాతో క‌లిసి `నీవెవ‌రో` ను నిర్మించేశారు. నీవెవ‌రో ఈ నెల 24న విడుద‌ల కానుంది. ఈ సినిమా గ్రాండ్ ప్రెస్‌మీట్‌కు వ‌చ్చిన బాబీ మాట్లాడుతూ “నాకు కోన వెంక‌ట్‌ని చూస్తే చాలా జెల‌సీగా ఉంది. నాతో జై ల‌వ‌కుశ చేసిన ఆయ‌న అప్పుడే మ‌రో స్క్రిప్ట్ చేసి ఆ సినిమాను నిర్మించి విడుద‌ల కూడా చేస్తున్నారు. నేను మాత్రం ఇంకా స్క్రిప్ట్ ప‌నుల్లోనే ఉండ‌టం బాధ‌గా ఉంది“ అని అన్నారు. సో కోన ఇప్పుడు జెట్ స్పీడ్‌లో ఉన్నార‌న్న‌మాట‌. స్నేహితులే త‌న ఆస్తి అని, ఏదైనా వారితోనే పంచుకుంటాన‌ని అంటున్నారు కోన‌. ద‌శ‌ర‌థ్‌, గోపీమోహ‌న్‌, గోపీచంద్ మ‌లినేని, బాబీ వంటివారు మాత్ర‌మే త‌న ఆస్తి అని చెప్పారు కోన‌.