‘అన్యాయం చేశావ్’ : మోహన్ బాబుపై మండిపడ్డ దాసరి కోడలు !

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై దాసరి నారాయణ రావు కోడలు దాసరి సుశీల సంచలన ఆరోపణలు చేశారు. తమ కాలేజీ పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ రాలేదని రోడ్డెక్కిన మోహన్ బాబు.. నా బిడ్డకు ఎందుకు అన్యాయం చేశారు’ అని దాసరి సుశీల ప్రశ్నించారు.

తన మామగారు దాసరి నారాయణ రావు ఆస్తి పంపకాల్లో మోహన్ బాబు పెద్దమనిషిగా ఉన్నారని ఆ విషయంలో తమకు అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి మరణం తర్వాత రెండు, మూడు రోజుల్లో ఆస్తి పంచుతామని చెప్పారని కానీ ఇప్పటివరకు ఆస్తి పంపకాలు జరగలేదని తెలిపారు.

అంతేకాదు దాసరి కుమారుడు, హీరో అరుణ్ కుమార్ పైనా సుశీల పలు ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని దాసరి మరణించిన రోజున చెప్పిన అరుణ్ కుమార్.. ఆ తర్వాత స్పందించడం లేదని తెలిపారు. మనందరిదీ ఒకే కుటుంబం దాసరి పేరును నిలబెట్టాలని మీడియాకి ఎక్కితే విషయం పరష్కారం కాదని కబుర్లు చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని మండిపడ్డారు.

ఆస్తి పంపకాల విషయం గురించి అరుణ్ కుమార్‌ను ప్రశ్నిస్తే మోహన్ బాబు రావాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని సుశీల తెలిపారు. ఇదే విషయాన్ని మోహన్ బాబును అడిగితే నాకేం సంబంధం అంటున్నారని ఆమె అన్నారు. ఈ గొడవల్లో తన బిడ్డ మాస్టర్ దాసరి నారాయణ రావు అన్యాయమైపోతున్నాడని అన్నారు.

తన కాలేజీ పిల్లలకు అన్యాయం జరిగిందంటూ ఎన్నికల ముందు మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చినట్టే.. తన కుమారుడికి అన్యాయం జరిగిందని తాను వచ్చానని వివరించారు. మెున్నటి వరకు దాసరి అరుణ్ మా కుటుంబ సభ్యుడు అని ఇప్పుడు ఒక నాయకుడని యాన వైసీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావీస్తూ ఆమె పేర్కొన్నారు. స్టేజ్ లపై మాట్లాడే అరుణ్ కుమార్ తన కుటుంబంలో జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.