బోయ‌పాటికి అర‌వింద్ అభయహస్తం,అసలేం జరిగిందంటే…

బోయ‌పాటికి అర‌వింద్ అభయహస్తం

విన‌య విధేయ రామ ఫ్లాఫ్ ఎఫెక్ట్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను పై మామూలుగా లేదు. ఆయన చెప్పే బడ్జెట్ కు నిర్మాతలు, ఆయన చెప్పే కథలకు హీరోలకు భయపడి ప్రక్కకు తప్పుకుంటున్నారు. అప్పటిదాకా అబ్బో..అద్బుతం..తీస్తే బోయపాటే యాక్షన్ సినిమాలు తీయాలని, ఆయన డైరక్షన్ లో చేయటం నా జీవితాశయం అని చెప్పే హీరోలంతా సైలెంట్ అయ్యిపోయారు. బోయపాటి కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన బాలయ్య సైతం మనకెందుకు అన్నట్లు ప్రక్కన పెట్టేసారు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ అభయహస్తం ఇచ్చారు.

త‌న బ్యాన‌ర్లోనో బోయ‌పాటి తో సినిమా నిర్మిస్తాన‌ని అఫీషియల్ గా స్టేజీపై ప్ర‌క‌టించాడు. దీంతో బోయ‌పాటికి కాస్త రిలీఫ్ ల‌భించిన‌ట్లు అయింది. వరసపెట్టి ఫ్లాఫ్ డైరక్టర్స్ కు తన బ్యానర్ లో సినిమాలు ఇస్తూ వాళ్ల చేత హిట్స్ కొట్టిస్తున్న అల్లు అరవింద్ మొత్తానికి బోయపాటి ఆఫర్స్ అన్నీ వెళ్లిపోయే దాకా ఆగారన్నమాట. ఇక వేరే దారిలేదు అనుకున్న టైమ్ లో అభయహస్తం చూపించారు. ఇక ఇప్పుడు సిట్యువేషన్ మొత్తం అల్లు అరవింద్ చేతిలో ఉంటుంది. ఆయన చెప్పే హీరో తో, చెప్పే బడ్జెట్ తో సినిమాని ముగించాలి.

గ‌తంలో బోయ‌పాటి- అర‌వింద్ కాబినేష‌న్ లో స‌రైనోడు వంటి సూపర్ హిట్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా గీతా ఆర్స్ట్ కి కాసులు వర్షం కురిపించి. ఆ న‌మ్మ‌కంతోనే పిలిచి మ‌రీ బోయ‌పాటికి అవ‌కాశం చెప్తున్నారు. గుణ‌369 ట్రైల‌ర్ కార్య‌క్రమంలో అర‌వింద్ ఈ విష‌యం ప్ర‌క‌టించాడు. దానికి కార్తికేయ వెల్ క‌మ్ టు గీతా ఆర్స్ట్ అంటూ చెప్ప‌డం విశేషం. మ‌రి ఈ సినిమాలో హీరో ఎవ‌రు? ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఇత‌ర డీటైల్స్ త్వరలోనే బయిటకు వస్తాయి.