Bigg Boss 4: ఆగస్టు 30 న ప్రారంభం, 15 మంది కంటెస్టెంట్లు, 105 రోజులు, 106 ఎపిసోడ్స్.. ఇది పక్కా..!

bigg boss telugu season 4 starting date confirmed

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా బిగ్ బాస్ గురించే చర్చ. బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఎవరు వస్తున్నారు… అని దాని గురించే ఎవరు మాట్లాడినా?

bigg boss telugu season 4 starting date confirmed
bigg boss telugu season 4 starting date confirmed

అవును.. బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇంతకుముందు వచ్చిన మూడు సీజన్లు కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ సీజన్ 4పై కూడా అంచనాలు పెరిగాయి.

నిజానికి బిగ్ బాస్ 4 ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి లైన్ అంతా క్లియర్ అయిపోయింది. కంటెస్టెంట్ల ఎంపిక తదితరాలు అన్నీ అయిపోయాయి.

ఇక.. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. హోస్ట్ నాగార్జునే అని ఇప్పటికే తెలుసు కానీ.. కంటెస్టెంట్ల విషయంలోనే కాస్త సందిగ్దత.. దాన్ని కూడా తొలగించడానికి సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. కానీ.. దాంట్లో నిజం ఎంతో చెప్పడం కష్టం.

మొత్తానికి అన్ని అవాంతరాలను పూర్తి చేసుకొని బిగ్ బాస్ షో ఈనెల 30న ప్రారంభం కానుంది. ఇక.. ఈ సారి 15 మంది కంటెస్టెంట్లను తీసుకున్నారట. ఒకరిద్దరు వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే చాన్స్ ఉంది. 105 రోజుల పాటు ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. మొత్తం 106 ఎపిసోడ్లను చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే సెలెక్ట్ అయిన 15 మంది ఇంటి సభ్యులు క్వారంటైన్ లో ఉన్నారట. రెండు వారాల నుంచి వాళ్లను క్వారంటైన్ లో ఉంచారట. వాళ్లందరినీ ఎక్కడికీ పంపించడం లేదట. వాళ్లకు తరుచూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారట. ఒకవేళ కరోనా పాజిటివ్ ఎవరికైనా వస్తే వాళ్లను షో నుంచి తప్సిస్తారట.

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. కరోనా ప్రభావం ఏ కంటెస్టెంట్ కు లేకుంటే.. వెంటనే ఆగస్టు 30 న ప్రారంభించడానికి అన్నింటినీ సంసిద్ధం చేసుకుంటోంది మాటీవీ.

ఇక.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు… సెలెక్ట్ అయిన 15 మంది కంటెస్టెంట్లు వీళ్లే…

సయ్యద్ సోహెల్, మహాతల్లి జాహ్నవి, ఆమె భర్త సుశాంత్, రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి, జెమిని యాంకర్ ప్రశాంతి, సింగర్ నోయల్, గీతా మాధురి భర్త నందు, జబర్దస్త్ ఫేం ముక్కు అవినాశ్, కరాటే కల్యాణి, జోర్దార్ వార్తల యాంకర్ సుజాత, టిక్ టాక్ స్టార్ మెహబూబా దిల్ సే, యాంకర్ అరియానా గ్లోరీ, దేత్తడి హారిక, టీవీ9 యాంకర్ దేవి.

ఈ 15 మందిని ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి.. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఇద్దరు ముగ్గురిని పంపించే అవకాశం ఉంది.

అయితే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పూనమ్ భజ్వా, మై విలేజ్ షో గంగవ్వ, ప్రియ వడ్లమాని, అపూర్వ, యామినీ భాస్కర్, అఖిల్ సార్థక్.. లలో ఎవరో ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే చాన్స్ ఉంది.