మన్మధుడు నాగార్జున స్పందించాలి

మన్మధుడు నాగార్జున స్పందించాలి

బిగ్ బాస్ 3వివాదంపై హోస్ట్ నాగార్జున అక్కినేని స్పందించాలని శ్వేతా రెడ్డి , గాయత్రీ గుప్తా నినదిస్తున్నా , నాగార్జున మాత్రం తాను నటించిన “మన్మధుడు 2” చిత్రం విడుదల విషయంలో బిజీ గా ఉన్నట్టు తెలుస్తుంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ , ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు . గతంలో నాగార్జున నటించిన “మన్మధుడు ” ఘన విజయం సాధించింది . మళ్ళీ చాలా రోజుల తరువాత నాగార్జున , రకుల్ ప్రీత్ తో కలసి ఈ రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నాడు .

“మన్మధుడు 2” సినిమాను వచ్చేనెల 9న విడుదల చేస్తున్నట్టు నాగార్జున తన ట్విట్టర్లో పేర్కొన్నాడు . అయితే గత రెండు రోజుల్లోగా “బిగ్ బాస్ 3” షో సెలక్షన్ సందర్భంగా అందులో నటించడానికి వచ్చే మహిళల పట్ల నిర్వాహకులు అనుచితంగా ప్రవర్తించారని , అవకాశం రావాలంటే బాస్ ను సంతోష పరచాలని చెప్పారని , అంటే పడక సుఖం అందిస్తే తప్ప అవకాశం ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారని యాంకర్ శ్వేతారెడ్డి , నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీనిపై మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి .

శ్వేతారెడ్డి , గాయత్రి గుప్తా కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా వున్నారు , సినిమా రంగ ప్రముఖుల దృష్టికి తీసుకెడతామని , బిగ్ బాస్ షో ముసుగులో అసాంఘిక , అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని చెబుతున్నారు . అయితే ఈ విషయంలో హోస్ట్ గా వున్న నాగార్జున మాట్లాడటం లేదు . పైగా తమ స్వంత సినిమా “మన్మధుడు 2” విడుదల , వ్యాపారం తదితర విషయాలపై స్పందిస్తున్నాడు తప్ప “బిగ్ బాస్ 3” గురించి పెదవి విప్పడం లేదు .

అయితే 60 సంవత్సరాల వయసులో నాగార్జున 20 సంవత్సరాల రకుల్ ప్రీతో రొమాన్స్ చేస్తూ నిర్మించిన “మన్మధుడు 2” సినిమా విషయంలో కూడా మహిళలు విమర్శిస్తున్నారు . ఇదే సమయంలో బిగ్ బాస్ విషయంలో నాగార్జున మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని విమర్శలు , నిరసనలు ఎక్కువవుతున్నాయి .