కుర్ర హీరో తింగరి చేష్టలు,జనం తిట్టిపోస్తున్నారు

                                       (సూర్యం)

తండ్రి అండతో హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇంకా లోక జ్ఞానం అబ్బినట్లు లేదు..లేకపోతే ఈ తింగరి చేష్టలేంటి..ఈ తలతిక్క యవ్వారాలు ఏంటి అంటున్నారు సోషల్ మీడియా జనం. ఆ కుర్రాడు సైలెంట్ గా ఉంటాడే..జనం ఏంటి ఇంత వైలెంట్ గా ఇతని మీద పడుతున్నాడు అనుకున్నారా…అందుకు సరైన రీజనే ఉంది లెండి.

ప్రస్తుతం ఈ కుర్ర హీరో … సీనియర్ డైరక్టర్ తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతోంది. దాంతో ఎలాగో ధాయి ల్యాండ్ వచ్చాం కదా అని సరదా కొద్ది అక్కడ  ఓ ఏనుగు మీదకు ఎక్కి దాని  దంతాలపై కూర్చొని ఫోటోకి ఫోజిచ్చాడు.

అక్కడితో ఆగకుండా ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జనాలను పండగ చేసుకోండి అన్నాడు. ఎప్పుడూ ఎక్కడ తప్పు దొర్లుతుందా ట్రోల్ చేద్దామా అన్నట్లు చూసే సోషల్ మీడియా జనం కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటోని ట్రోల్ చేయటం మొదలెట్టారు. దంతాలుపై కూర్చున్నావు..అది ఓ జీవమున్న జంతువు అని మర్చిపోయావా.. దానికి ఎంత నొప్పి పెడుతుంది అంటూ కామెంట్స్ దద్దరిల్లేలా చేసాడు. దాంతో  వివాదానికి తెరలేపినట్లుంది. బెల్లంకొండ చేసిన పనికి ముఖ్యంగా ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటో తీసుకోవడాన్ని జంతు ప్రేమికులు వ్యతిరేకించటం మొదలెట్టారు.

ఈ హీరో అలా చేయడం జీవ హింస కిందే వస్తుందని అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది గ్రహించిన బెల్లంకొండ శ్రీనివాస్ వెంటనే తన ఖాతా నుండి ఫోటోని తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.  అదండీ విషయం. కాస్తంత కుర్రాడు స్పీడు తగ్గించి..ఇలాంటి చేష్టలు మానుకుంటే కెరీర్ కి మంచింది.