‘ఎన్టీఆర్‌’బయోపిక్ టైటిల్ మార్చి, రిలీజ్ డేట్ ప్రకటన

ఎన్టీఆర్‌ జీవితాన్ని ‘ఎన్టీఆర్‌’అనే వర్కింగ్  టైటిల్ తో సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ  కనిపించనున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్‌.బి.కె సంస్థ నిర్మిస్తోంది. విద్యాబాలన్‌, రానా, సుమంత్‌ కీలక పాత్రలు పోషిసున్నారు. సావిత్రి పాత్రలో నిత్యమేనన్‌ నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం టైటిల్ ని మారుస్తూ…రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఈ మేరకు చిత్ర వర్గాలు పోస్టర్ విడుదల చేసారు.

మారిన టైటిల్ ప్రకారం … ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్ తో  ఈ సినిమా రానుంది. జనవరి 9, 2019 న సంక్రాంతికి కానుకగా ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

 ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్  కృష్ణాజిల్లా దివిసీమలో   జరుగుతోంది. హంసలదీవి సమీపంలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో పాటు సినీలో కీ రోల్స్ చేస్తన్న వారంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. బుధవారం నుంచి శనివారం వరకూ అక్కడే షూటింగ్‌ జరగనుంది. అలాగే  ‘ఎన్టీఆర్ కథానాయుకుడు‌’ని రెండు భాగాలుగా విడుదల చేస్తారని, తొలి భాగంలో ఎన్టీఆర్‌ సినీ జీవితం చూపిస్తారని, రెండో భాగంలో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ ఈ విషయంలో అధికారిక  ప్రకటన ఏదీ చేయలేదు.