ఎన్టీఆర్, బాలయ్య కలవటానికి కారణం అతనే

బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ బాబాయ్, అబ్బాయి లు అయినా ఎప్పుడూ ఎడమొహం, పెడమొహంగా ఉంటారు. అయితే హరికృష్ణ మరణం అనంతరం…వీరిద్దరూ ఒకటి అవుతున్నారు. ఏమో భవిష్యత్ లో వీరిద్దరు కలిసి ఓ సినిమా చేసినా చేస్తారు అని చెప్పుకునేంతలా వీరి బంధం బలపడనుంది. అందుకు `అరవింద సమేత వీర రాఘవ` సక్సెస్ వేదిక ఆలంబన కానుంది.

ఎన్టీఆర్ నటించిన  `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం విజయం సందర్బంగా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికపై నటసింహా నందమూరి బాలకృష్ణ కనపడి అలరించనున్నారు. ఈ స్టేజిపై బాలయ్య – ఎన్టీఆర్ – కల్యాణ్ రామ్ కనిపించి నందమూరి అభిమానులకు ఆనందం కలగ చేయనున్నారు. ఇక ఇలాంటి అదృష్టం అభిమానులకు కలగటానికి కారణం కేవలం కళ్యాణ్ రామ్ మధ్యవర్తిత్వమే అంటున్నారు..  బాలయ్యని
ఒప్పించి, ఫంక్షన్ కు రప్పించింది కళ్యాణ్ రామ్ అని చెప్పుకుంటున్నారు.

ఇది ఇలా ..ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో …వీరి కలయిక రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టించే విషయమే. ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టికి ప్రచారం చేస్తాడని, ఆ మేరకు మాటలు కూడా జరిగాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ కు కూడా నందమూరి అభిమానులందరి సపోర్ట్ దొరకనుంది.