అనుష్క నటనకు గుడ్ బై చెప్పేస్తోందా?!

అనుష్క నటనకు గుడ్ బై చెప్పేస్తోందా?!

అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రభాస్ హీరోగా నటించిన `బాహుబ‌లి` విడుదల‌కి ముందు విడుదల త‌రువాత అనుష్క పెద్ద‌గా సినిమాలెవీ ఒప్పుకోలేదు. ‌`బాహుబ‌లి` సిరీస్‌లో దేవ‌సేన‌గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించి  విశేషంగా అందర్నీఆక‌ట్టుకున్న అనుష్క షాకింగ్ నిర్ణ‌యం తీసుకోనుందా?  నటనకు గుడ్ బై చెప్పేస్తోందా?!

అని అందరూ అనుకుంటున్నారు. 2017లో అనుష్క న‌టించిన `బాహుబ‌లి 2` చిత్రం విడుద‌లైంది. ఆ త‌రువాత `భాగ‌మ‌తి`, `నిశ్శ‌బ్దం` అనుష్క న‌టించినవి రెండే రెండు చిత్రాలు. చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించింది. అది కూడా  మెగాస్టార్ మాట కాద‌న‌లేకనట. `నిశ్శ‌బ్దం` త‌రువాత అనుష్క  గౌత‌మ్‌మీన‌న్ చిత్రంలో న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపింఛాయ్.  

అయితే ఆ సినిమా ప‌ట్టాలెక్కేలా క‌నిపిపించ‌డం లేదు. అనుష్క గ‌త కొంత కాలంగా సినిమాల ఎంపిక విష‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల్ని బ‌ట్టి చూస్తే క్ర‌మ క్ర‌మంగా అమె సినిమాల‌కు దూరం కావాల‌నే ఇలా సినిమాల్ని అంగీక‌రించ‌డం లేద‌నే బలంగా వినిపిస్తోంది.