రిషీకపూర్ కు అనుపమ్ ధైర్యం చెప్పాడట

రిషీకపూర్ కు అనుపమ్ ధైర్యం చెప్పాడట

క్యాన్సర్ వ్యాధితో న్యూయార్క్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న హిందీ హీరో ను అనుపమ్ ఖేర్ పరామర్శించాడు . గత కొంతకాలంగా రిషికపూర్ క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నాడు . ముంబైలో చికిత్స చేయించుకున్నాడు . అయినా వ్యాధిలో ఎలాంటి మార్పు కనిపించలేదు . మెరుగైన డాక్టర్ల సలహామేరకు రిషీకపూర్ తన భార్య నీతూ కపూర్ తో కలసి న్యూయార్క్ వెళ్లి అక్కడ ఆసుపత్రిలో చేరారు .

రిషీకాపూర్ కు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి ముంబై సినిమా రంగ ప్రముఖులు వెళ్లి పరామర్శిస్తునే వున్నారు . న్యూ యార్క్ వచ్చిన తరువాత కూడా అనేకమంది సినిమావారు రిషీ కపూర్ ను కలసి త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తూనే వున్నారు . ఇప్పుడు అనుపమ్ ఖేర్ న్యూయార్క్ వెళ్లి రిషీ కపూర్ , నీతూ కపూర్ తో కొంత సమయం గడిపాడు . రిషీకపూర్ తో అనుపమ్ ఎన్నో చిత్రాల్లో నటించారు . ఇద్దరు అలనాటి కబుర్లు చెప్పుకున్నారు .

క్యాన్సర్ బారి నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుపమ్ కపూర్ మనస్ఫూర్తిగా కోరుకున్నాడు . వారిద్దరూ గొప్ప దంపతులని , వారితో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ .. రిషీ శారీరకంగానే కాదు మాసికంగా కూడా కోలుకోవాలని తానూ ప్రార్దించినట్టు ట్విట్టర్లో అనుపమ్ ఖేర్ తెలిపాడు .