అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ…!

                                                                      (ధ్యాన్)

అక్కినేని మూడో త‌రం వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్‌.. ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. అయితే అఖిల్ రెండు సినిమాలు అనుకున్నంత హిట్ లేదు. మూడో సినిమా సెట్స్‌లో ఉంది. ఈ సినిమా పూర్తి కాక‌మునుపే నాలుగో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. హీరో ఆది పినిశెట్టి అన్న‌య్య‌, డైరెక్ట‌ర్ స‌త్య ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ సినిమా చేయ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించ‌బోతున్నాడ‌ట‌. క‌ర‌ణ్ జోహార్ రంగంలోకి రావ‌డంతో సినిమా స్పాన్‌, రేంజ్ మారిపోయిన‌ట్లేన‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. దీంతో సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధ‌మైన‌ట్లే. నిజానికి అఖిల్ త‌న తొలి సినిమానే బాలీవుడ్‌లో చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. అయితేనేం.. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్న‌ట్లే…!