భారతీయుడికి బాలీవుడ్ ట‌చ్‌…

                                                               (ధ్యాన్)

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భార‌తీయుడు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా `ఇండియ‌న్ 2` రూపొంద‌నుంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ సినిమాను నిర్మించ‌డానికి దిల్‌రాజు ముందుకు వ‌చ్చినా.. ఆయ‌న డ్రాప్ కావ‌డంతో.. ఇప్పుడా సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. ఈ సినిమాను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి శంక‌ర్ ప్లాన్ చేసేశాడు. తన సినిమాకు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను రప్పించేలా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌ను న‌టింప‌చేయ‌డానికి సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట శంక‌ర్‌.