అంత ముఖ్య ఘట్టానికి ఎన్టీఆర్ రాకపోవడంతో మళ్ళీ మొదటికే వచ్చిన రచ్చ.!

రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో పలు కీలక అంశాలకు సంబంధించి సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార” ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా డామినేట్ చూపించడం వంటివి ఒకింత ఆసక్తిగా మారాయి.

అయితే ఇది జరిగిన కొన్ని రోజులు వీరి కుటుంబంలో ఓ ఊహించని విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కూతురు నందమూరి ఉమా మహేశ్వరి ఆకస్మిక మరణం షాకివ్వగా ఇపుడు ఈ విషయంలో ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబీకులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హంగా మారింది.

సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి పోస్ట్ రాకపోవడం పైగా కీలక ఘట్టం అంత్యక్రియల్లో కూడా తారక్ కనిపించకపోవడం ఇప్పుడు అందరిలో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది. అయితే ఉమా మహేశ్వరి అంతిమ యాత్రలో బాలకృష్ణ మాత్రం కనిపించారు.

మరి ఈ రకంగా ఏమన్నా ఎన్టీఆర్ బయటకి రాలేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ అంశం మాత్రం సినీ వర్గాల్లో కాస్త చర్చనీయాంశం గానే మారింది.