ప్రియుడుపై టీవి నటి పోలీస్ కేసు, బాధతో ఆత్మహత్య

తన లవరే తనపై పోలీస్ కేసు పెట్టిందని బాధతో ఓ అభాగ్యుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆమె  ఓ నటి కావటంతో ఇప్పుడు ఆ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.  వివరాల్లోకి వెళితే..

గుర్తుందా.. నటి ఇంద్రాణి. ఆ మధ్యన   తమిళనాడు స్టెర్‌లైట్‌ ఉద్యమానికి పోలీసుల కమీషనర్  డ్రస్ లో వెళ్లి పోలీస్ లను విమర్శిస్తూ..దాన్ని   షూట్ చేసి ఓ వీడియోని ఫేస్ బుక్ లో పెట్టి  అడ్డంగా బుక్ అయ్యింది. ఆ తర్వాత బెయిల్ పై బయిటకు వచ్చి టీవి సీరియల్స్ లో బిజీ అయ్యింది.  రీసెంట్ గా  ఆమె  తన ప్రియుడు గాంధీ లలిత్ కమార్ పై కేసు పెట్టడానికి కోర్ట్ గుమ్మం ఎక్కింది. తనను పెళ్లి చేసుకోవాలని తనతో బ్రేకప్ అయ్యిన మాజీ ప్రియుడు..వేధిస్తున్నాడని ఆ కంప్లైంట్ సారాంశం. గాంధీ డైరక్షన్ డిపార్టమెంట్ లో పని చేస్తున్నాడు.

ఈ విషయమై  మైలాపూర్ పోలీసులను ఆశ్రయించిన  నీలాణి పని చేసే చోటుకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని   ఫిర్యాదులో పేర్కొంది.   గాంధీ లలిత్‌కుమార్‌  తో ఆమె  మూడేళ్ల నుంచి రిలేషన్ లో ఉంది. అయితే రీసెంట్ గా ఇద్దరూ ఓ విషయమై గొడవపడి విడిపోయారు. అయితే గాంధీ మాత్రం ఆమెను వదిలటం లేదని, దాంతో ఆమె షూటింగ్ కు వచ్చి …పెళ్లి చేసుకోవాలని గొడవ చేయటం మొదలెట్టాడని ఆమె చెప్తోంది.

ఇంతకు ముందు సైతం షూటింగ్ లకు వచ్చినా ..ప్రేమతో కబుర్లు చెప్పేవాడు. ఇప్పుడు ఇలా గొడవపెట్టుకునే స్దాయికి దిగటంతో వేరే దారిలేక పోలీస్ కంప్లైంట్ చేసానంటోంది.   దాంతో పోలీస్ లు  ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సలింగ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మనస్దాపం చెందిన గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు.