అంద‌రూ తాప్సీని ఫిక్స‌య్యాన‌ని అనుకుంటున్నారు… ఆది పినిశెట్టి

వైవిధ్య‌మైన సినిమాతో ముందుకెళ్తున్నారు ఆది పినిశెట్టి. తాజాగా ఆయ‌న న‌టించిన `నీవెవ‌రో` శుక్ర‌వారం విడుద‌ల కానుంది. తాప్సీ, రితికాసింగ్ హీరోయిన్లుగా న‌టించారు. హ‌రినాథ్ ద‌ర్శ‌కుడు. కోన వెంక‌ట్‌, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా ఆది పినిశెట్టి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. 

 

*  ఈ సినిమాలో మీరు మెయిన్ లీడ్ అయి ఉండి, తాప్సీ పాత్ర‌ను మెచ్చుకున్నారేంటి?

– ఇందులో నేనే హీరో. మీరు అడిగిన డౌట్ నే నా ఫ్రెండ్ సర్కిల్ లోనూ కొంత‌మంది అడిగారు. అయినా నేను మెయిన్ లీడ్ అయి ఉండి, అలా ఎందుకు చెప్పానో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది.

 

* త‌మిళ్‌లో చేయ‌బోయే ఆర్ ఎక్స్ 100 లోనూ తాప్సీని రిపీట్ చేస్తున్నార‌ట కదా?

– లేదండీ. అంద‌రూ అలా అని అనుకుంటున్నారు. ఇంకా దర్శ‌కుడు ఎవ‌రో, హీరోయిన్ ఎవ‌రో డిసైడ్ కాలేదు.

 

* మీ సినిమా `నీవెవ‌రో` త‌మిళ సినిమాకు రీమేక్ అట క‌దా?

– అవునండీ. త‌మిళంలో `అదే క‌న్‌గ‌ళ్‌` అనే సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని చేశాం. అందులో సోల్ బావుంటుంది. అందుకే సోల్‌ని తీసుకున్నాం. మిగిలిన స‌న్నివేశాల‌న్నీ మేం ఇక్క‌డ‌కు త‌గ్గ‌ట్టు మార్చేశాం.

 

* తెలుగులో అవ‌కాశాలు రాక‌నే ఇన్నాళ్లూ హీరోగా చేయ‌లేదా?

– ఆ మాట త‌ప్పండీ. తెలుగులో నాకు చాలా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ డ‌బ్బుల కోసం మాత్ర‌మే కావాలంటే చేసి ఉండ‌వ‌చ్చు. మా నాన్న చాలా డ‌బ్బులు సంపాదించారు. అందుకే నేను డ‌బ్బు గురించి, అవ‌కాశాల గురించి ఆలోచించ‌కుండా, నాకు న‌చ్చిన కేర‌క్ట‌ర్ల గురించి మాట్లాడుతున్నాను.

 

* త‌ర్వాతి సినిమాలేంటి?

 – హేమంత్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తిక్ నిర్మాత‌గా ఓ బైక్ రేస్ సినిమా చేస్తా. ఇది బై లింగ్వుల్‌. అదే స‌మ‌యంలోనే `ఆర్ ఎక్స్ 100` త‌మిళ రీమేక్ లోనూ న‌టిస్తాను.