రెండు తెలుగు రాష్ట్రాల్లో 2. 0 కలెక్షన్స్ తెలుసా?

సూపర్ స్టార్  రజనీకాంత్ ,హిందీ హీరో అక్షయ్ కుమార్ తో  దర్శకుడు శంకర్ రూపొందించిన “2. 0” చిత్రం గురువారం నాడు ప్రపంచమంతా విడుదలైంది .

దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణమైంది . సుమారు 500 నుంచి  600 కోట్ల రూపాయల వ్యయం అయినట్టు చెబుతున్నారు .

అయితే  “2. 0” చిత్రాన్ని థియేటర్ , శాటిలైట్ , మ్యూజిక్ కలిపి విడుదలకు ముందు 560 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది .

ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నిర్మాత , పంపిణీదారు ఎన్వీ ప్రసాద్ 72 కోట్లకు తీసుకున్నట్టు చెబుతున్నారు .

అయితే రెండు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్ లలో ఈ సినిమాను విడుదల చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు ఫుల్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .

సినిమా కూడా కంప్యూటర్ మాయాజాలం తప్ప మరేమీ లేదనే విమర్శ కూడా వుంది . ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా విడుదల చేసిన ఎన్ . వి . ప్రసాద్ నష్టపోవడం ఖాయమని అంటున్నారు . ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో మొదటిరోజున 12. 43 కోట్లను మాత్రమే వసూలు చేసింది .

సినిమా సూపర్ హిట్ అనే  టాక్ రాకపోవడంతో ఆశించినవిధంగా ఇక ముందు వసూలు ఉండకపోవచ్చని అంటున్నారు .

ఇక భారత దేశంలో తొలిరోజు అన్ని భాషల్లో కలిపి 85 కోట్లను  మాత్రమే వసూలు చేసినట్టు తెలుస్తుంది .