హీరోయిన్ మిస్సింగ్‌.. కొత్త ప్ర‌చార‌మా?

హీరోయిన్ మిస్సింగ్ అంటూ ద‌ర్శ‌కుడు సుబ్బు పంజా గుట్టా పోలీసుల్ని ఆశ్ర‌యించాడు. త‌న‌కు `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్ వంగా నుంచి ఆఫర్ అంటూ, ప్ర‌భాస్ సినిమాలో న‌టించాల‌ని చెబుతూ ఓ వ్య‌క్తి కృతి గార్గ్ ని ట్రాప్ చేసి ముంబై ర‌ప్పించార‌ని, అ విష‌యం తెలిసి ఆమెని ఫోన్ ట్రై చేస్తే క‌ల‌వ‌డం లేద‌ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. దీంతో టాలీవుడ్‌లో క‌ల్లం మొద‌లైంది.

హీరోయిన్‌ని ట్రాప్ చేయ‌డం ఏంట‌ని, అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. ఇదిలా వుంటే మీడియాకు షాకిస్తూ గంట‌లు తిర‌క్కుండా హీరోయిన్ ఓ వీడియోని విబుద‌ల చేసి తాను ఎలాంటి ట్రాప్‌లో ప‌డ‌లేద‌ని, ఒక‌డు త‌న‌ని హీరోయిన్ అవ‌కాశం పేరుతో ట్రాప్ చేయాల‌ని ప్ర‌య‌త్నించాడ‌ని. అయితే తాను తెలివిగా ఆ ట్రాప్ నుంచి బ‌య‌ట‌పడ్డాన‌ని, ప్ర‌స్తుతం ముంబైలోని త‌న ఇంటిలోనే సుర‌క్షితంగా వున్నాన‌ని వీడియో సందేశాన్ని పంపించింది. ఇక్క‌డే అస‌లు క‌థ వున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం `రాహు`. ఈ సినిమా ద్వారా కృతి గార్గ్ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కోస‌మే ద‌ర్శ‌కుడు హీరోయిన్ ట్రాప్ డ్రామా ఆడాడా? లేక నిజంగానే కృతిని ఎవ‌రైనా ట్రాప్ చేయాల‌ని చూశారా? అన్న‌ది మాత్రం ఎవ‌రికి అంతుచిక్క‌డం లేదు.