స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌యుడు సేఫే

క‌రోనా వైర‌స్ వ‌ర‌ల్డ్‌ని షేక్ చేస్తోంది. ప్ర‌పంచం ఏ ట‌ర్న్ తీసుకుంటుందో న‌ని ప్ర‌జ‌లంతా ప్రాణాల్ని అర‌చేతుల్లో పెట్టుకుని బ్ర‌తుకుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఈ వైర‌స్ ఇండియాని కూడా తాకింది. విదేశాల నుంచి ఇండియాకి వ‌చ్చిన వారి వ‌ల్లే ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి నెల‌కొంది. ఫారిన్‌లో వుంటున్న వంద‌లాది మంది ఇండియా తిరిగి వ‌స్తూ వెంట వైర‌స్‌ని కూడా తీసుకొస్తున్నారు.

దీంతో ఇండియా ప్ర‌మాదంలో ప‌డిపోతోంది. ఫారిన్ నుంచి ఇండియా వ‌స్తున్న వారిని ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేస్తూ ఐసోలేష‌న్ సెంట‌ర్ల‌లో పెట్టి చికిత్స‌ని అందిస్తోంది. కొంత మంది క్వారెంటైన్‌ల‌లోకి స్వ‌చ్ఛందంగా వెళుతుంటే మ‌రికొంత మంది మాత్రం అందులో నుంచి త‌ప్పించుకుని బ‌య‌టికి వ‌చ్చేస్తున్నారు. మ‌రి కొంత మంది మాత్రం క్వారెంటైన్‌ల‌లోకి వెళ్ల‌కుండా త‌మ ఇంటిలోనే హౌస్ అరెస్ట్ అయిపోయి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

గ్రేట్‌ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం త‌న‌యుడు నంద‌న్ ఇటీవ‌ల లండ‌న్ నుంచి ఇండియా వ‌చ్చాడు. అత‌నికి క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ఏయిర్ పోర్ట్ సిబ్బంది ఇంటికి పంపించారు. అయినా స‌రే త‌న వంతు బాధ్య‌త‌గా త‌న ఇంట్లో వారికి దూరంగా సెల్ఫ్ క్వారెంటైన్‌లో వుండిపోయాడు నంద‌న్‌. దీనికి సంబంధించిన వీడియోని న‌టి ఖుష్బూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతా ఇలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.