`సైరా` వాయిదా! చిరంజీవి సీరియస్!!
ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో దానిపై అంచనాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. పైగా మెగాస్టార్ చిరంజీవి లాంటి క్రేజీ స్టార్ నటిస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు అటువైపే ఉంటుంది. ప్రస్తుతం బాస్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా: నరసింహారెడ్డి` అత్యంత భారీ కాన్వాసుతో తెరకెక్కుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
అయితే ఆ తేదీకి అన్ని పనులు పూర్తి కావడం లేదని, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆలస్యం వల్ల మరోసారి వాయిదా పడిందని ఫిలింనగర్ లో పుకార్ షికారు చేస్తోంది. సైరా చిత్రాన్ని అక్టోబర్ నుంచి 2020 జనవరికి షిష్ట్ చేశారని, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని ఒక వార్త వైరల్ గా ప్రచారం అవుతోంది. అయితే ఈ విషయం తెలిసిన బాస్ చిరంజీవి ప్రమోషన్స్ టీమ్ పై సీరియస్ అయ్యారట.
ఏదీ అధికారికంగా ప్రకటించక ముందే ఈ పుకార్లన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయి? అంటూ ప్రశ్నించారట. అయినా అంత పెద్ద కాన్వాసుతో దాదాపు 200 కోట్లు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాపై ఇలాంటి ప్రచారం చేయడం ఎంత వరకూ సబబు? పైగా అయినదానికి కాని దానికి డిబేట్లు పెట్టే జాతీయ మీడియాకి ఇలాంటి లీకులు అందించడం అంత క్షేమం కాదన్న భావన కొణిదెల కాంపౌండ్ లో వ్యక్తం అయ్యిందట.
`సైరా` వాయిదా వార్తలు ఇప్పుడే కాదు. ఇంతకుముందు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా మోతెక్కించేశారు. దీంతో ప్రతిసారీ ఇలా రిపీటవ్వడం బాస్ కి నచ్చలేదని తెలుస్తోంది. తామర తంపరగా వస్తున్న ఈ లీకు వార్తలపై బాస్ చిరంజీవి సీరియస్ అయ్యారన్నది హాట్ టాపిక్ గా మారింది. `సైరా` చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
అయితే ఆ తేదీకి అన్ని పనులు పూర్తి కావడం లేదని, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆలస్యం వల్ల మరోసారి వాయిదా పడిందని ఫిలింనగర్ లో పుకార్ షికారు చేస్తోంది. సైరా చిత్రాన్ని అక్టోబర్ నుంచి 2020 జనవరికి షిష్ట్ చేశారని, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని ఒక వార్త వైరల్ గా ప్రచారం అవుతోంది. అయితే ఈ విషయం తెలిసిన బాస్ చిరంజీవి ప్రమోషన్స్ టీమ్ పై సీరియస్ అయ్యారట.
ఏదీ అధికారికంగా ప్రకటించక ముందే ఈ పుకార్లన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయి? అంటూ ప్రశ్నించారట. అయినా అంత పెద్ద కాన్వాసుతో దాదాపు 200 కోట్లు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాపై ఇలాంటి ప్రచారం చేయడం ఎంత వరకూ సబబు? పైగా అయినదానికి కాని దానికి డిబేట్లు పెట్టే జాతీయ మీడియాకి ఇలాంటి లీకులు అందించడం అంత క్షేమం కాదన్న భావన కొణిదెల కాంపౌండ్ లో వ్యక్తం అయ్యిందట.
`సైరా` వాయిదా వార్తలు ఇప్పుడే కాదు. ఇంతకుముందు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా మోతెక్కించేశారు. దీంతో ప్రతిసారీ ఇలా రిపీటవ్వడం బాస్ కి నచ్చలేదని తెలుస్తోంది. తామర తంపరగా వస్తున్న ఈ లీకు వార్తలపై బాస్ చిరంజీవి సీరియస్ అయ్యారన్నది హాట్ టాపిక్ గా మారింది. `సైరా` చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.