‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై డిజాస్టర్ డైరక్టర్

షాక్..అక్కడ మెహర్ రమేష్ ని చూసి..

చిరంజీవి హీరోగా సురేందర్‌‌‌‌ రెడ్డి రూపొందించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్​ చరణ్‌‌ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై సిని పెద్దలు చాలా మంది కనిపించి కనువిందు చేసారు. అయితే అక్కడ మెహర్ రమేష్ కనపడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వెనక ఆయన ఉన్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మెహర్ రమేష్ …మెగా క్యాంప్ లో చాలా మందికి సన్నిహితుడు. కానీ సైరా పంక్షన్ లో చూసిన చాలా మంది త్వరలో మెగా హీరోల్లో ఒకరితో మెహర్ రమేష్ సినిమా ఉందని అభిప్రాయపడుతున్నారు.

తెలుగు పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్ కొన్నాళ్లు వెలిగారు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ప్లాఫ్ అయ్యాయి. అటు ప్రేక్షకులను మెప్పింలేక..ఇట నిర్మాతలను కూడా నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పారిపోయే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.

మెహర్ రమేష్ డైరక్ట్ చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ మాములు ఫ్లాపులుకాదు. దారణంగా విఫలమయ్యాయి. ఉన్నంతలో కంత్రి, భిల్లానే బెస్ట్. దాంతో మెహర్ రమేష్‌ను నమ్మడం పూర్తిగా మానేసారు నిర్మాతలు. ముఖ్యంగా షాడో సినిమా వచ్చి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన కు ఒక్క ప్రాజెక్టు కూడా సెట్ కాలేదు. కానీ చిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడూ మహేష్ తో ఉంటూంటారు. అలాగే మెగా క్యాంప్ లో అందరితో సన్నిహితంగా ఉంటూంటారు.