సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన లావ‌ణ్య‌!

టాలీవుడ్ హీరోయిన్‌లు అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఈ ఇద్ద‌రూ త‌న‌కు భార్య‌ల‌ని, సీక్రెట్‌గా వారిని పెళ్లాడాన‌ని సునిశిత్ అనే తింగ‌ర మేళం ఇటీవ‌ల ప్ర‌చారం చేసుకోవ‌డం మొద‌లైంది. సోష‌ల్ మీడియాల్లో, యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లో సునిశిత్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు, లావ‌ణ్య త్రిపాఠి, త‌మ‌న్నాల‌పై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

దీంతో ఈ ప్ర‌చారం కాస్తా లావ‌ణ్య త్రిపాఠి దాకా చేరింది. దీంతో ఆగ్ర‌హించిన లావ‌ణ్య త్రిపాఠి. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సునిశిత్ చేసిన వ్యాఖ్య‌లు భంగం క‌లిగించేవిలా వున్నాయ‌ని, వీటిని మొగ్గ‌లోనే తుంచాల‌ని భావించిన లావ‌ణ్య సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించింది. త‌న‌పై జ‌రుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌న‌పై అస‌భ్య‌క‌రంగా వ్యాఖ్య‌లు చేస్తున్న సునిశిత్‌పై చ‌ట్ట‌ప‌రంగా కేసు వేయాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు విన్న‌వించింది. దీంతో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సునిశిత్‌పై కేసు పెట్టిన‌ట్టు తెలిసింది.