“సాహో” లో మెయిన్ ట్విస్ట్

“సాహో” కథలో క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే?

మరికొద్ది రోజులలో ప్రభాస్ హీరోగా రూపొందిన “సాహో” భారీగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ యాక్టివిటీస్ తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్,శ్రద్దా కపూర్ హిందీలో అనేక టీవీ షోలలో పాల్గొంటూ చిత్రానికి మరింత హైప్ తెస్తున్నారు. ఈ నేపధ్యంలో సాహో కథ ఎలా ఉండబోతోందనే విషయమై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా పూర్తి స్దాయి ట్విస్ట్ లతో నడవనుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే కీ ట్విస్ట్ సినిమాను నిలబెట్టనుంది.

ఫిల్మ్ నగర్ లో చెప్పుకునేదాన్ని బట్టి ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒకరు పోలీస్ అయితే మరొకరు దొంగ. ముంబై బ్యాంక్ నుంచి మూడు వందల కోట్లు దొంగతనం చేస్తాడు. దొంగ ప్రభాస్ కేసుని పోలీస్ ప్రభాస్ సీక్రెట్ గా ఛేదిస్తూంటాడు. క్లైమాక్స్ లో తెలిసే విషయం ఏమిటంటే ..దొంగ, పోలీస్ ఒకరే. రెండు క్యారక్టర్స్ అసలు లేవు. ఒక ప్రభాసే ..ఇద్దరిగా భ్రమింపచేసాడు. అయితే ఆ అనుమానం ఎక్కడా రాకుండా స్క్రీన్ ప్లే గమ్మత్తుగా సాగుతుంది. అయితే ఇది ఊహా లేక నిజమా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

చిత్రం బిజినెస్ విషయానికి వస్తే..ట్రేడ్ వర్గాలలో చెప్పుకునేదాని ప్రకారం సాహో ప్రపంచ వ్యాప్తంగా 333కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిసినెస్ జరిపిందని వినికిడి. ఈ మూవీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న టి సిరీస్ హిందీ థియరిటికల్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ కలుపొకొని 120కోట్లకు ఎగ్రిమెంట్ చేసుకుందని సమాచారం.