‘సాహో’ రిలీజ్ రోజున ప్రభాస్ ఎక్కడుంటాడు,ప్లాన్ ఏంటి?

సాహో రిలీజ్ రోజున ప్రభాస్ ఎక్కడుంటాడంటే…

మరో తొమ్మిది రోజుల్లో ప్రభాస్ సాహో చిత్రంతో థియోటర్స్ లో దిగబోతున్నాడు. దేశం మొత్తం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరణంలో రిలీజ్ రోజున ప్రభాస్ ఎక్కడ ఉండబోతున్నాడు..ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరమైన విషయం. ఫస్ట్ డే ఫస్ట్ షో ని ఎక్కడ ఆయన చూడబోతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమాని చూసినప్పటికీ ఆ రోజు రిపోర్ట్ వింటూ ఫ్యాన్స్ హంగామా చూస్తూ సినిమా చూడటంలో ఓ కిక్ ఉంటుంది. అది ప్రతీ హీరో రిలీజ్ రోజు మార్నింగ్ షో కు అనుభవించేదే. ప్రభాస్ కూడా అందుకు అతీతుడేం కాదు.

ప్రస్తుతం ప్రభాస్ ..సాహో హిందీ వెర్షన్ ని ముంబైలో భారీ ఎత్తున ప్రమోట్ చేయటంలో బిజీగా ఉన్నాడు. అనేక టీవి షోలలో పాల్గొంటున్నాడు. 22 న తేదీన అంటే రేపు మళయాళ వెర్షన్ ప్రమోషన్ కోసం త్రివేండ్రమ్ వెల్లనున్నారు. అక్కడ మీడియా, ప్యాన్స్ ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు రెడీ గా ఉన్నారు. ఆ తర్వాత రోజు చెన్నైలో, బెంగుళూరులో ప్రమోషన్స్ లో పాల్గొంటారు. 24, 25 తారఖీలలో హైదరాబాద్ లో ఉంటారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లబోతున్నారు.

దుబాయ్ కు చెందిన ఫరాస్ ఫిల్మ్స్ వారు భారీగా సాహో రైట్స ని తీసుకుని యష్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రభాస్ ని ప్రమోషన్ కోసం రమ్మన్నారు. దాంతో దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి లండన్ కు వెళ్తారని తెలుస్తోంది. దీన్ని బట్టి ఆగస్టు 30 నాటికి ప్రభాస్ లండన్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.