‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్‌ స్పీచ్

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్‌ ఏం మాట్లాడాడంటే…

ప్యాన్ ఇండియా మూవీగా భారీ హైప్‌ క్రియేట్‌చేసిన సాహో రిలీజ్‌కు సిద్దమవుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ​ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం సాయంత్రం సాహో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు. ఈ పంక్షన్ లో ప్రభాస్ అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు.

ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసు. సుజీత్‌ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిక్కరేసుకొని వచ్చాడు. అప్పుడు అతడికి 24 ఏళ్లు (నవ్వులు). అప్పటికే మా ప్రొడక్షన్‌లో ‘రన్‌ రాజా రన్‌’ చేశాడు. అందరికీ నచ్చింది. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా నాకు కథ చెప్పాడు. షూటింగ్‌ ప్రారంభమవడానికి ఏడాది ముందే చాలా వర్క్‌ చేశాడు. యాక్షన్‌ డైరెక్టర్లను కలిశాడు. ఆయా సన్నివేశాలు ఎలా తీయాలో వాళ్లతో ముందే ప్లాన్‌ చేశాడు. చాలా పెద్ద పెద్ద టెక్నిషియన్లను తీసుకున్నాడు. అంతమందినీ చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు.

Prabhas Speech | Saaho Pre Release Event | Shraddha Kapoor | Sujeeth | Ghibran | UV Creations

ఇక హీరోయన్ శ్రద్ధాకపూర్‌ రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పనిచేసింది. ముంబయి నుంచి వస్తూ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. యాక్షన్‌ సన్నివేశాలు కూడా బాగా చేసింది. తను ‘సాహో’కు పనిచేయడం మా అదృష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చా. కానీ, ఈసారి మాటివ్వకుండా చేయాలనుకున్నా. ట్రైలర్‌లో చూశారుగా ఛేజింగ్‌లు, జెట్‌లు.. అందుకే సమయం పట్టింది. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి. రూ.100కోట్ల ప్రాఫిట్‌ను వదులుకుని మరీ సినిమా చేశారు.

ఈ సినిమాకు పెద్ద పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు. మది, సాబు‌, శ్రీకర్‌‌, కమల్‌గార్ల సహకారం మర్చిపోలేనిది. కథ విన్న తర్వాత జాకీష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌, మందిరాబేడి వంటి నటులు వెంటనే ఒప్పుకొన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాను మొదటి రోజు నుంచి అనిల్‌ తడాని ఎంతో ప్రోత్సహించారు. ’’ అని ప్రభాస్‌ అన్నారు.