సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమా ఆగిపోయిందా?

సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమా ఆగిపోయిందా?

సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఆగిపోయిందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో మాత్రం అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్`. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనే స్లోగ‌న్‌తో విభిన్న‌మైన క‌థాంశంతో ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్నాడు. మే1న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసిన ఈ చిత్రం క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా వాయిదా ప‌డేలా క‌నిపిస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఓ సినిమా అంగీక‌రించాడు. జె.భ‌గ‌వాన్‌, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్యే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతుల మీదుగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇప్ప‌టి వర‌కు ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం అర్థాంత‌రంగా ఆగిపోయింద‌ని వార్తాలు షికారు చేయ‌డం మొద‌లైంది.

విష‌యం సీరియ‌స్ కావ‌డంతో నిర్మాత‌లు జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు రూమ‌ర్‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. మా సినిమాపై వ‌స్తున్న పుకార్ల‌లో ఎలాంటి వాస్త‌వం లేదు. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేశాం. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో షూటింగ్‌ని వాయిదా వేశామే కానీ సినిమాని ఆపేయ‌లేద‌న‌రి క్లారిటీ ఇచ్చాడు.