సాయిధరమ్ తేజకు గీతా ఆర్ట్స్ లో మరో పండగ

తేజు తాజా చిత్రంగా ‘ప్రతిరోజూ పండగే’. వచ్చేనెల 20వ తేదీన భారీ విడుదల. గీతా ఆర్ట్స్ లోనే తదుపరి సినిమా అన్నట్టు తెలుస్తున్నది . కెరియర్ స్టార్టింగ్‌లోనే మంచి మంచి హిట్‌లు కొట్ట‌డంతో సాయిధరమ్ తేజ్ వ‌రుస హిట్లు ఇస్తూ వెళ్లాడు. ఇటు యూత్ కి .. అటు మాస్ ఆడియన్స్ కి ఆయనను చేరువ చేసిన సినిమాల్లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఒకటి. అల్లు అరవింద్ ఈ సినిమాతో తేజూను కొంతవరకూ నిలబెట్టగలిగారు. ఈ మధ్య కాలంలోను తేజు వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై అల్లు అరవింద్ .. తేజుతో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కూడా తేజూతో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అన్నారు. త్వరలోనే ఆ వివరాలను తెలియపరచనున్నారు.