సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ ఎట్రాక్ట్ చేసింది. దీంతో స్టార్ హీరోలు సందీప్‌కి పార్టీలు కూడా ఇచ్చారు. త్వ‌ర‌లో మ‌హేష్‌తో సందీప్ సినిమా మొద‌ల‌వుతుంది అనే స‌మ‌యంలోనే అత‌నికి టీ సిరీస్ నుంచి `అర్జున్‌రెడ్డి` హిందీ రీమేక్ ఆఫ‌ర్ వ‌చ్చింది. దాంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయాడు.

అక్క‌డ షాహీద్‌క‌పూర్‌తో రీమేక్ చేసిన `క‌బీర్‌సింగ్‌` కూడా సంచ‌న విజ‌యం సాధించ‌డంతో ఇక సందీప్ అక్క‌డే సెటిలైపోతాడ‌ని అంతా భావించారు. సందీప్ కూడా ర‌ణ‌బీర్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్‌సింగ్‌ల‌తో సినిమా చేయాల‌నుకున్నాడు. ర‌ణ్‌వీర్‌సింగ్ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వుండ‌టం, ర‌ణ‌బీర్ క‌పూర్ ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్‌పై దృష్టిసారించాడు. ప్ర‌భాస్‌తో సినిమా ఫిక్స్ అయింది కూడా. `డెవిల్` పేరుతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని చేయాల‌నుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ స్థానంలో నాగ్ అశ్విన్‌తో ప్ర‌భాస్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు బుధ‌వారం ప్ర‌క‌ట‌న రావ‌డంతో సందీప్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యాడ‌ట‌.

రాధాకృష్ణ‌కుమార్ చిత్రం త‌రువాత త‌న‌తో చేయాల్సింది నాగ్ అశ్విన్‌ని లైన్‌లోకి ఎందుకు తీసుకొచ్చాడు?.. ఇప్పుడు త‌న `డెవిల్‌` వుంటుందా? ఉండ‌దా? అనే అయోమ‌యానికి లోన‌వుతున్నాడ‌ట‌.